Corona Virus: ఏపీలో మరో 68 మందికి కరోనా నిర్ధారణ

  • గత 24 గంటల్లో 9,664 శాంపిళ్ల పరీక్ష
  • మొత్తం కరోనా కేసులు 2,787
  • ఆసుపత్రుల్లో 816 మందికి చికిత్స  
  • మృతుల సంఖ్య మొత్తం 58
  Total positive cases in the state  2787

ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షలు నిర్వహిస్తోన్న కొద్దీ కరోనా వైరస్ కేసులు భారీగా బయటపడుతున్నాయి. గత 24 గంటల్లో 9,664 శాంపిళ్లను పరీక్షించగా మరో 68 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 10 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 2,787 అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 816 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,913 మంది డిశ్చార్జ్ అయ్యారు. తూర్పు గోదావరి జిల్లాలో  మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 58కి చేరింది.

More Telugu News