పోతిరెడ్డిపాడు తవ్వితే వైఎస్ కు హారతులు పట్టింది ఎవరు?: కాంగ్రెస్ నేతలపై మండిపడ్డ కేటీఆర్
- కాళేశ్వరం నీళ్లు చూసి కాంగ్రెస్ నేతలకు కడుపు మండుతోందన్న కేటీఆర్
- కాంగ్రెస్ నేతలు దీక్షలు చేస్తామనడం హాస్యాస్పదం అంటూ వ్యాఖ్యలు
- రైతులకు కేసీఆర్ అన్యాయం చేయరని ఉద్ఘాటన
ఎండాకాలంలో కూడా నీళ్లు వస్తుండడం చూసి కాంగ్రెస్ నేతలకు కన్నీళ్లు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం నీళ్లు చూసి కాంగ్రెస్ నేతలకు కడుపు మండుతోందని అన్నారు. కాంగ్రెస్ నేతలు దీక్షలు చేస్తామనడం హాస్యాస్పదం అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతల తీరు హంతకులే సంతాపం తెలిపినట్టుగా ఉందని పేర్కొన్నారు. రైతులకు కేసీఆర్ ఎప్పుడూ అన్యాయం చేయరని కేటీఆర్ స్పష్టం చేశారు.