Corona Virus: ఏపీలో మరో 44 మందికి కరోనా నిర్ధారణ

  • గత 24 గంటల్లో 10,240 శాంపిళ్ల పరీక్ష
  • అదే సమయంలో 41 మంది డిశ్చార్జ్‌  
  • మొత్తం కరోనా కేసులు 2,671
  • ఆసుపత్రుల్లో 767 మందికి చికిత్స  
coronavirus cases in ap

ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షలు నిర్వహిస్తోన్న కొద్దీ కరోనా వైరస్ కేసులు భారీగా బయటపడుతున్నాయి. గత 24 గంటల్లో 10,240 శాంపిళ్లను పరీక్షించగా మరో 44 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 41 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 2,671 అని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 767 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,848 మంది డిశ్చార్జ్ అయ్యారు.  మృతుల సంఖ్య మొత్తం 56కి చేరింది.

More Telugu News