Marriage: పెళ్లికూతురుకు కరోనా... పెళ్లికొడుకు సహా అందరూ క్వారంటైన్ కు!

  • రెండు రోజుల క్రితం మధ్యప్రదేశ్ లో జరిగిన పెళ్లి
  • జ్వరంతో బాధపడుతున్న పెళ్లికూతురు
  • పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్టు వెల్లడి
  • మొత్తం 32 మంది క్వారంటైన్ కు తరలింపు
32 members sent to quarantine after bride tested corona positive

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో, విచిత్రమైన కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పెళ్లి చేసుకున్న ఓ జంట కాపురానికి సిద్ధమవుతున్న వేళ... పెళ్లికూతురుకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో, వధూవరుల కుటుంబసభ్యులతో పాటు పెళ్లికి హాజరైన అందరిలో కలవరం మొదలైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ భోపాల్ సమీపంలోని జట్ ఖేడి ప్రాంతంలో చోటుచేసుకుంది.

రెండు రోజుల క్రితం ఈ వివాహం జరిగింది. లాక్ డౌన్ నిబంధనలకు లోబడే... అతి తక్కువ మంది బంధువులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి తంతును ముగించారు. అయితే పెళ్లికూతురు అప్పటికే స్వల్ప జ్వరంతో బాధపడుతోంది. కాకపోతే మందులు వాడుతూ కాస్త హుషారుగానే కనిపించింది. ఆ తర్వాత జ్వరం కొంచెం ఎక్కువ కావడంతో హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఆమెకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో, ఆమెతో పాటు మొత్తం పెళ్లికి హాజరైన 32 మంది బంధువులను క్వారంటైన్ కు తరలించారు.

More Telugu News