కరోనా కంటే కేసీఆర్ కు కూతురు కవితే ముఖ్యమయ్యారు: రేవంత్ రెడ్డి, షబ్బీర్
- నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎస్ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
- కూతురి కోసం కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారంటూ ఆరోపణ
- ఎంపీ ఎన్నికల్లో ఓడిన కవితకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తున్నారని వెల్లడి
ఎంపీ ఎన్నికల్లో ఓడిన కవితకు కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తున్నారని, కూతురు కోసం కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. కరోనా కంటే కేసీఆర్ కు కవితే ముఖ్యమయ్యారని వ్యాఖ్యానించారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.