పాకిస్థాన్ లో విమాన ప్రమాదం... 99 మంది దుర్మరణం?
- కరాచీ విమానాశ్రయం సమీపంలో కుప్పకూలిన విమానం
- ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా ప్రమాదం
- ప్రమాద వేళ విమానంలో 91 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది
ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా, విమానం ఒక్కసారిగా అదుపుతప్పి విమానాశ్రయం సమీపంలోని జిన్నా గార్డెన్ ఏరియాలో కూలిపోయింది. ఘటనపై సమాచారం అందుకున్న పాక్ క్విక్ రియాక్షన్ బృందాలు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక కార్యక్రమాలకు ఉపక్రమించాయి. కాగా, ఈ ప్రమాదంలో అనేక ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. విమానం నివాస గృహాలపై కూలిపోవడంతో స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో మరణించి ఉంటారని భావిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం రావాల్సి ఉంది.