Corona Virus: ఏపీలో మరో 45 మందికి కరోనా నిర్ధారణ

  • గత 24 గంటల్లో 8,092 శాంపిళ్ల పరీక్ష
  • 41 మంది డిశ్చార్జ్‌
  • మొత్తం కరోనా కేసులు 2,452
  • ఆసుపత్రుల్లో 718 మంది చికిత్స
coronavirus cases in ap

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు మరిన్ని బయటపడ్డాయి. గత 24 గంటల్లో 8,092 శాంపిళ్లను పరీక్షించగా మరో 45 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 41 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 2,452 అని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 718 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,680 మంది డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో నెల్లూరులో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మొత్తం 54కి చేరింది.

More Telugu News