Corona Virus: ఏపీలో మరో 52 మందికి కరోనా నిర్ధారణ.. కర్నూలులో 615కు చేరిన కేసులు

  • గత 24 గంటల్లో 9,713 శాంపిళ్ల పరీక్ష
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,282
  • ఆసుపత్రుల్లో 705 మందికి చికిత్స
  • 1,527 మంది డిశ్చార్జ్  
coronavirus cases in ap

ఏపీలో కరోనాకు అడ్డుకట్ట పడడం లేదు. పరీక్షలు చేస్తున్న కొద్దీ పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 9,713 శాంపిళ్లను పరీక్షించగా మరో 52 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 94 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 2,282 అని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 705 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,527 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో మృతి చెందిన వారి సంఖ్య 50కి చేరింది.

రాష్ట్రంలో గత 24 గంటల్లో చిత్తూరులో 15, తూర్పుగోదావరిలో 5, కడపలో 2, కృష్ణాలో 15, కర్నూలులో 4, నెల్లూరులో 7, విశాఖపట్నంలో 1, విజయనగరంలో 1, పశ్చిమ గోదావరిలో 2 కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. కర్నూలులో మొత్తం కేసులు 615కు చేరాయి.
                     
జిల్లాల వారీగా కేసుల వివరాలు..
           

More Telugu News