ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. త్వరలో తెరుచుకోనున్న ఆలయాలు
- భక్తుల మధ్య భౌతిక దూరం తప్పనిసరి
- దర్శనానికి ఆన్లైన్లో టైం స్లాట్ బుక్ చేసుకోవాలి
- ఆలయ పరిసరాలు హైపోక్లోరైడ్ ద్రావణంతో ఎప్పటికప్పుడు స్ప్రే
దర్శనానికి సంబంధించిన టైం స్లాట్ను ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించింది. ఆలయాల్లో డిస్ ఇన్ఫెక్షన్ టన్నెల్ ఏర్పాటు చేయడంతోపాటు శానిటైజేషన్కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. అలాగే, ఆలయ పరిసరాలను, క్యూలను ఎప్పటికప్పుడు హైపోక్లోరైడ్ ద్రావణంతో స్ప్రే చేయాలని ఈవోలకు పంపిన ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఆలయాలు ఎప్పటి నుంచి తెరవాలన్న విషయాన్ని మాత్రం అందులో పేర్కొనలేదు.