Chiranjeevi: రజాకార్ల నేపథ్యంలో సాగే కథ .. చిరూను సంప్రదించనున్న దర్శకుడు

  • మాస్ దర్శకుడిగా సంపత్ నంది
  • 'రచ్చ' తో చరణ్ కి హిట్ ఇచ్చిన దర్శకుడు
  • తాజా చిత్రంగా రానున్న 'సీటీమార్'
Sampath nandi Movie

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ ఒక భారీ బడ్జెట్ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. కొంతవరకూ చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఆ తరువాత సినిమాగా చిరంజీవి 'లూసిఫర్' రీమేక్ లో చేయనున్నట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పై దర్శకుడు సుజీత్ కసరత్తు చేస్తున్నాడు.  ఈ సినిమా తరువాత చిరంజీవిని ఒప్పించే పనిలో దర్శకుడు సంపత్ నంది వున్నాడని అంటున్నారు.

మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకులలో సంపత్ నంది ఒకరుగా కనిపిస్తాడు. చాలా కాలం క్రితమే చరణ్ తో 'రచ్చ' చేసిన ఈ దర్శకుడు,  చిరంజీవితో చేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. రజాకార్ల నేపథ్యంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా సంపత్ నంది ఈ కథను సిద్ధం చేసుకున్నాడట. త్వరలో చిరంజీవికి వినిపించడానికి సిద్ధమవుతున్నాడని అంటున్నారు.  ప్రస్తుతం గోపీచంద్ హీరోగా ఆయన 'సీటీమార్' సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత ఆయన చిరంజీవిని కలిసే అవకాశం వుంది. ఆయన ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి.

More Telugu News