Palghar: పాల్గర్ కేసులో సాధువుల న్యాయవాది యాక్సిడెంటులో దుర్మరణం... అనుమానాలు వ్యక్తం చేస్తున్న బీజేపీ!

  • కోర్టు విచారణ నిమిత్తం కారులో ప్రయాణం
  • అదుపు తప్పి డివైడర్ ను ఢీకొన్న కారు
  • ఆర్డీఓ స్థాయి అధికారి విచారణ 
Lawyer in Palbhar Bob Linching Case died in Accident

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాల్గర్ మూకదాడి కేసులో సాధువుల తరఫున వాదిస్తున్న న్యాయవాది దిగ్విజయ్ త్రివేది ఓ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఇదే కేసు వాదనల నిమిత్తం ఆయన కారులో వెళుతుండగా, ముంబై - అహ్మదాబాద్ నేషనల్ హైవేపై ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ఆయన కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఆ సమయంలో కారులో ఆయనతో పాటు మరో మహిళ కూడా ఉండగా, ఆమెకు తీవ్రగాయాలు అయ్యాయి.

కాగా, ఈ యాక్సిడెంట్ పై బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాధువుల తరఫున వాదిస్తున్నందుకు ఎవరైనా కుట్ర చేశారా? అన్న అనుమానం తమకుందని పార్టీ నేత సంబిత్ పత్రా వ్యాఖ్యానించారు. గతంలో ఈ కేసును వెలుగులోకి తెచ్చిన వారిపై కాంగ్రెస్ నేతలు దాడులకు దిగారని గుర్తు చేశారు. ఈ కారు ప్రమాదంపై ఆర్డీఓ స్థాయి అధికారి విచారణ నిర్వహిస్తుండగా, నివేదిక వచ్చిన తరువాత నిజానిజాలు వెల్లడవుతాయని త్రివేది సహచర న్యాయవాది పీఎన్ ఓజా అభిప్రాయపడ్డారు.

More Telugu News