400 మందికి పైగా తెలుగు ఎన్నారైలు ఇక్కడ చిక్కుకుపోయారు... దయచేసి సమస్యను పరిష్కరించండి: కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి
- లాక్ డౌన్ కు ముందు భారత్ వచ్చిన ఎన్నారైలు
- లాక్ డౌన్ ప్రకటించడంతో ఇక్కడే చిక్కుకుపోయిన వైనం
- ఓ యువతి ట్వీట్ కు స్పందించిన చంద్రబాబు
"జయశంకర్ గారూ ఎన్నారైల అంశాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. లాక్ డౌన్ కు ముందు భారత్ వచ్చిన 400 మందికి పైగా తెలుగు ఎన్నారైలు ఇక్కడే నిలిచిపోయారు. ఈ ఎన్నారైల కుటుంబాలు అమెరికాలోనే ఉండిపోయాయి. వీళ్లేమో ఇక్కడ అమెరికా కాన్సులేట్ లో నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల జారీ ప్రక్రియ ప్రారంభం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. దయచేసి ఈ సమస్యను పరిష్కరించండి" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.