America: తుమ్మినా తుంపర్లు పడకుండా.. రెడీ అవుతున్న కొత్త తరం దగ్గుబిళ్ల

  • దగ్గుబిళ్లను అభివృద్ధి చేస్తున్న అమెరికా పరిశోధకులు
  • అది వేసుకోగానే బరువెక్కనున్న లాలాజలం
  • తుంపర్లు గాల్లో కలవకుండా నేలపైకి
American Researchers develop new cough tablet

కరోనా రోగి తుమ్మినా, దగ్గినా ఆ వ్యక్తి నుంచి వచ్చే తుంపర్లు ఇతరుల మీద పడితే అతడు కూడా కోవిడ్ బాధితుడిగా మారతాడు. ఈ నేపథ్యంలో అవతలి వ్యక్తి తుమ్మినా, దగ్గినా అతడి నోటి నుంచి తుంపర్లు చుట్టుపక్కల వ్యక్తులపై పడకుండా ఉండేందుకు అమెరికా పరిశోధకులు కొత్త రకం దగ్గు బిళ్లలను అభివృద్ధి చేస్తున్నారు.

బయటకు వెళ్లడానికి ముందు ఈ బిళ్లలను నోట్లో వేసుకుంటే లాలాజలం బరువు పెరిగి చిక్కగా మారిపోతుంది. ఫలితంగా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అతడి నోటి నుంచి వచ్చే తుంపర్లు గాల్లో కలవకుండా నేలపై పడిపోతాయి. ఫలితంగా కోవిడ్ రిస్క్ తగ్గుతుందన్నమాట.

మాస్కు ధరించి ఈ బిళ్లలను వేసుకుంటే భౌతిక దూరం రెండు అడుగులు పాటిస్తే సరిపోతుందని సెంట్రల్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయ పరిశోధకుల (యూసీఎఫ్) బృందం తెలిపింది. హైస్పీడ్ కెమెరాల ద్వారా ఈ దగ్గుబిళ్లపై పరిశోధన జరిపినప్పుడు తుమ్మినప్పుడు ఆ తుంపర్లు ఎక్కువ దూరం వెళ్లకపోవడాన్ని వారు గమనించారు.

More Telugu News