Corona Virus: భారత్‌లో 78 వేలు దాటిన కరోనా కేసులు

  • గత 24 గంటల్లో భారత్‌లో 134 మంది మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 2,549
  • 24 గంటల్లో దేశంలో 3,722 మందికి కరోనా
  • కోలుకున్న 26,235 మంది
Spike of 3722 COVID19 cases 134 deaths in the last 24 hours

భారత్‌లో కొవిడ్‌-19 వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 134 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 2,549కి చేరింది.

ఇక గత 24 గంటల్లో దేశంలో 3,722 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో కరోనా కేసుల సంఖ్య 78,003కి చేరింది. అలాగే, కరోనా నుంచి 26,235 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 49,219 మంది చికిత్స పొందుతున్నారు.

More Telugu News