Sensex: ఉద్దీపన ప్యాకేజీ ప్రభావంతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Sensex ends 637 points higher
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 637 పాయింట్లు లాభపడి 32,009కి పెరిగింది. నిఫ్టీ 187 పాయింట్లు పుంజుకుని 9,384కి చేరుకుంది. టెలికాం, హెల్త్ కేర్ మినహా మిగిలిన సూచీలు లాభాల్లో ముగిశాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యాక్సిస్ బ్యాంక్ (7.02%), అల్ట్రాటెక్ సిమెంట్ (6.15%), ఎల్ అండ్ టీ (5.98%), ఐసీఐసీఐ బ్యాంక్ (5.04%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (4.44%).

టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-5.38%), సన్ ఫార్మా (-2.47%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.80%), భారతి ఎయిర్ టెల్ (-0.70%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News