ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద పరిస్థితి అదుపులోకి వచ్చింది: మంత్రి కన్నబాబు
- పరిశ్రమ వద్ద ప్రస్తుతం 82.6 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందని వెల్లడి
- ప్రజలు మరో 24 గంటలపాటు శిబిరాల్లోనే ఉండాలని సూచన
- ఘటనపై నివేదిక ఇవ్వాలంటూ కంపెనీ ప్రతినిధులకు ఆదేశాలు
దక్షిణ కొరియాలోని కంపెనీ ప్రతినిధులతో అధికారులు మాట్లాడారని, ఘటనపై నివేదిక ఇవ్వాలని కంపెనీ ప్రతినిధులను ఆదేశించామని తెలిపారు. ప్రజలు, పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఆ నివేదికలో స్పష్టం చేయాలని కోరామని పేర్కొన్నారు. నిపుణులు పరిసర గ్రామాల్లోని నీరు, మట్టి ఇతర నమూనాలు పరీక్షిస్తున్నారని కన్నబాబు వెల్లడించారు. పరిశ్రమలో ట్యాంకుల స్థితి బాగుందని నిపుణుల బృందం నివేదిక ఇచ్చిందని చెప్పారు.