కోలీవుడ్లో నయా జోష్.. పోస్టు ప్రొడక్షన్ పనులకు తమిళనాడు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- టీవీ, సినిమాల పోస్టు ప్రొడక్షన్ పనులకు ప్రభుత్వం అనుమతి
- గరిష్టంగా ఐదుగురితో పనులు చేసుకోవచ్చంటూ ఉత్తర్వులు
- కృతజ్ఞతలు తెలిపిన నిర్మాతలు
గరిష్ఠంగా ఐదుగురితో ఎడిటింగ్, డబ్బింగ్, డీఐ, రీ రికార్డింగ్ సౌండ్ డిజైన్ /మిక్సింగ్ పనులు చేసుకోవచ్చని, వీఎఫ్ఎక్స్/సీజీఐ పనుల కోసం గరిష్టంగా 15 మందిని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అయితే, ఈ విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించడం తప్పనిసరని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి వాటిని విధిగా పాటించాలని సూచించింది. పోస్టు ప్రొడక్షన్ పనులకు అనుమతినిచ్చిన ప్రభుత్వానికి నిర్మాతలు కృతజ్ఞతలు తెలిపారు.