Vizag Gas Leak: మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి పరిహారం: జగన్

  • వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న వారికి రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా
  • అస్వస్థతకు గురైన వారికి రూ. లక్ష
  • బాధిత గ్రామాల్లోని ప్రతి కుటుంబానికి రూ. 10 వేలు
Rs 1 cr compensation for each death families of gas leak says Jagan

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో మృతి చెందిన 9 మంది కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారాన్ని ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఈ ఘటనలో గాయపడి, రెండుమూడు రోజులు చికిత్స పొందే వారికి రూ. లక్ష ఇస్తామని చెప్పారు. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న వారికి రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని అన్నారు. 5 బాధిత గ్రామాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి రూ. 10 వేల చొప్పున ఇస్తామని తెలిపారు. చనిపోయిన పశువుకు రూ. 25 వేల వంతున యజమానికి పరిహారం చెల్లిస్తామని చెప్పారు. గ్యాస్ లీకేజీ ఘటనలో బాధితులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు పరిహారాన్ని ప్రకటించారు.

More Telugu News