Botsa Satyanarayana: విశాఖ ఘటనపై రాష్ట్ర మంత్రుల దిగ్భ్రాంతి

  • ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి
  • బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం
  • పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం 
AP Ministers statement about vizag incident

విశాఖలో గ్యాస్ లీకేజ్ ఘటనపై రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, సుచరిత, గుమ్మనూరు జయరాం, ఏపీఐఐసీ చైర్మన్ రోజా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులను హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారని, సహాయక చర్యలను, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరమని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని రోజా ఆకాంక్షించారు.

More Telugu News