Corona Virus: భారత్‌లో తీవ్ర రూపం దాల్చిన కరోనా... 24 గంటల్లో 3,561 మందికి పాజిటివ్‌ నిర్ధారణ

  • కరోనా మృతుల సంఖ్య మొత్తం 1,783
  • ఆసుపత్రుల్లో 35,902 మందికి చికిత్స
  • కోలుకున్న వారు 15,266 మంది
Total number of COVID19 positive cases in India rises to 52952 including 35902 active cases

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 89 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 1,783కి చేరింది.

గత 24 గంటల్లో దేశంలో 3,561 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం  52,952కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 15,266 మంది కోలుకోగా, ఒకరు విదేశాలకు వెళ్లిపోయారు. ఆసుపత్రుల్లో 35,902 మంది చికిత్స పొందుతున్నారు.

More Telugu News