Corona Virus: 24 గంటల్లో దేశంలో 2,958 మందికి కొత్తగా కరోనా

  • కరోనా మృతుల సంఖ్య మొత్తం 1,694
  • ఆసుపత్రుల్లో 33,514 మందికి చికిత్స
  • కోలుకున్న 14,182  మంది
Total number of COVID19 positive cases in India rises to 49391

భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి, మరణాలు రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 126 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 1,694 చేరింది.

గత 24 గంటల్లో దేశంలో 2,958 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 49,391కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 14,182 మంది కోలుకోగా, ఒకరు విదేశాలకు వెళ్లిపోయారు. ఆసుపత్రుల్లో  33,514 మంది చికిత్స పొందుతున్నారు.
 





More Telugu News