Nagachaitanya: 'లవ్ స్టోరీ'కి సంబంధించి అదంతా పుకారేనంటున్న టీమ్

  • శేఖర్ కమ్ముల నుంచి మరో ప్రేమకథా చిత్రం
  • చైతూ సరసన నాయికగా సాయిపల్లవి
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు
Love Story Movie

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య - సాయిపల్లవి జంటగా 'లవ్ స్టోరీ' రూపొందింది. విభిన్నమైన కథాకథనాలతో ఆయన ఈ సినిమా చేశాడు. లాక్ డౌన్ తరువాత ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఏసియన్ సంస్థవారు ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది.

 ఈ సినిమా ఫైనల్ కట్ చూసిన చైతూ, కొన్ని సన్నివేశాల్లో సాయిపల్లవి తనని పూర్తిగా డామినేట్ చేసిందని భావించాడని చెప్పుకుంటున్నారు. ఆ సన్నివేశాలను మళ్లీ రీ షూట్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడని అంటున్నారు. ఈ విషయంపై తాజాగా ఈ సినిమా యూనిట్ సభ్యులు స్పందిస్తూ, ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని స్పష్టం చేశారు. అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందనీ, సాయిపల్లవి - చైతూ కూడా పోటీపడి చేశారని అన్నారు. 'ఫిదా' తరువాత శేఖర్ కమ్ముల .. సాయిపల్లవి నుంచి వస్తున్న ఈ సినిమా, ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.

More Telugu News