హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ
- ప్రకాశం జిల్లాలో గ్రానైట్ క్వారీ యజమానులకు నోటీసులు
- గతంలోనే ఈ అంశంపై ఒక తీర్పును ఇచ్చామన్న హైకోర్టు
- లాక్ డౌన్ సమయంలో జరిమానాలు విధించడం ఏమిటంటూ ఆగ్రహం
ఈ పిటిషన్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన హైకోర్టు... ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో గతంలోనే ఒక తీర్పును వెలువరించామని... ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా గ్రానైట్ పరిశ్రమ మూతపడిన తరుణంలో జరిమానాలు విధించడం ఏమిటని ప్రశ్నించింది.
ఇప్పటికిప్పుడే ప్రభుత్వ నోటీసులకు క్వారీల నిర్వాహకులు స్పందించాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది. లాక్ డౌన్ ముగిసిన తర్వాత, గ్రానైట్ పరిశ్రమ గాడిలో పడిన తర్వాత ఆలోచిద్దామని చెప్పింది.