Pakistan: పాకిస్థాన్ లో పెట్రోల్ ధర లీటరుకి రూ.20 వరకు తగ్గింపు!

  • కరోనా, లాక్ డౌన్ ఎఫెక్ట్ తో క్రూడాయిల్ ధరల పతనం
  • ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్న పాకిస్తాన్
  • ఈ మేరకు డాన్ పత్రికలో వెలువడ్డ కథనం
Petrol price going to cut in Pakistan

కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు పతనం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ పొరుగు దేశమైన పాకిస్థాన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పాక్ లోని ‘డాన్’ పత్రిక కథనం ప్రకారం, లీటర్ పెట్రోల్ ధరను రూ.20 వరకు తగ్గించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించిందని, రేపటి నుంచే తగ్గిన ధరలు అమల్లోకి వస్తాయని ఆ కథనంలో పేర్కొంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) తో చర్చించిన తర్వాతే పాక్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ‘డాన్‘ తెలిపింది.

More Telugu News