Raviteja: వెంకీ కోసం రాసిన కథలో హీరోగా రవితేజ

  • రవితేజ తాజా చిత్రంగా 'క్రాక్'
  • తదుపరి సినిమా నక్కిన త్రినాథరావుతో
  • లైన్లో రమేశ్ వర్మ
nakkina Trinatha Rao

రవితేజ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్' సినిమా రూపొందుతోంది. చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకున్న ఈ సినిమా, లాక్ డౌన్ తరువాత చకచకా మిగిలిన పనులను పూర్తిచేయనుంది. ఆ తరువాత రవితేజ .. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు.

నక్కిన త్రినాథరావు ఈ కథను వెంకటేశ్ ను దృష్టిలో పెట్టుకుని సిద్ధం చేశాడట. కథ విన్న వెంకటేశ్ అంతగా ఆసక్తిని చూపలేదని సమాచారం. దాంతో త్రినాథరావు ఆ కథను రవితేజకు వినిపించడం .. ఆయన ఓకే చెప్పేయడం జరిగిపోయాయని అంటున్నారు. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా మార్పులు చేసిన త్రినాథరావు, త్వరలో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఇక 'రాక్షసుడు' సినిమాతో హిట్ కొట్టిన రమేశ్ వర్మ దర్శకత్వంలోను రవితేజ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

More Telugu News