కరోనా ఎప్పటికీ మనతోనే ఉంటుందన్న జగన్ వ్యాఖ్యలపై సీపీఐ రామకృష్ణ ఫైర్
- సాధారణ జ్వరంతో పోల్చడం దారుణం
- సీఎం పేషీలో ఎవరికైనా కరోనా వస్తే తప్ప అది ప్రమాదకరమైన వ్యాధి అని గుర్తించరా?
- రాష్ట్రంలో కేసులు తెలంగాణను మించిపోయాయి
ఏపీలో కరోనా వైరస్ ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తోందని... రాష్ట్రంలోని కేసులు తెలంగాణను మించిపోయాయని ఆయన చెప్పారు. రాజ్ భవన్ సిబ్బందికి, ఆరోగ్యమంత్రి సిబ్బందికి కూడా కరోనా సోకిందని... పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా వ్యాధి తీవ్రతను తక్కువ చేస్తూ సీఎం మాట్లాడటం సరికాదని అన్నారు.