Rahul Gandhi: కరోనా కిట్ల స్కాంకు పాల్పడిన వారిపై మోదీ చర్యలు తీసుకోవాలి: రాహుల్ గాంధీ

  • టెస్టింగ్ కిట్లను 145 శాతం అధిక ధరలకు కొన్నారంటూ  ఆరోపణలు
  • ఈ కుంభకోణం ప్రతి భారతీయుడికి అవమానం లాంటిది 
  • అవినీతిపరులను చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్
Rahul Gandhi demands action against corona testing kits scamsters

కరోనా వైరస్ టెస్టింగ్ కిట్ల కొనుగోళ్ల అంశం రాజకీయంగా ప్రకంపనలు పుట్టిస్తోంది. వాస్తవ ధర కంటే 145 శాతం అధిక ధరకు కిట్లను కొనుగోలు చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ, తన లక్షలాది సోదర సోదరీమణులు పడుతున్న అంతులేని బాధ ద్వారా లాభం పొందాలని ఎవరైనా ప్రయత్నించడం అనేది నమ్మలేనిది. ప్రతి భారతీయుడికీ ఇది అవమానకరం' అన్నారు.
 
ఈ కుంభకోణం విషయంలో ప్రధాని మోదీ తక్షణమే స్పందించాలని... స్కామ్ లో పాలుపంచుకున్న అవినీతిపరులను చట్టం ముందు నిలబెట్టాలని ప్రధాని మోదీని కోరుతున్నానని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

More Telugu News