India: దేశంలో కరోనా విజృంభణ... 24 గంటల్లో 56 మరణాలు

  • 779కి పెరిగిన మొత్తం మరణాలు
  • 1490 కొత్త కేసులు నమోదు
  • 24,942కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య
More deaths in India as corona spreads rapidly

భారత్ లో ఫిబ్రవరి నుంచి కరోనా వ్యాప్తి మొదలైందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు 24,942 మందికి కరోనా నిర్ధారణ అయింది. వారిలో 18,953 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1490 కొత్త కేసులు నమోదు కాగా, ఒక్కరోజులోనే 56 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 779కి పెరిగింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 5210 అని కేంద్రం వెల్లడించింది.

More Telugu News