militants: పుల్వామాలో భారీ ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు సహా ముగ్గురి హతం

  • ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో కార్డన్ సెర్చ్
  • కాల్పులు ప్రారంభించిన ఉగ్రవాదులు
  • తిప్పి కొట్టిన భద్రతా దళాలు
Two militants aide killed in Pulwama encounter

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు సహా వారికి సహకరిస్తున్న మరో వ్యక్తి హతమయ్యాడు. దక్షిణ కశ్మీర్ జిల్లాలోని అవంతిపొరలోని గోరిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు ఈ తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించాయి.

ఈ క్రమంలో ఎదురుపడిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. వెంటనే తేరుకున్న భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు, వారికి సహకరిస్తున్న మరో వ్యక్తి హతమైనట్టు, గాలింపు కొనసాగుతున్నట్టు చెప్పారు.

More Telugu News