Chiranjeevi: మా సంసారంలో నిప్పులు పోయద్దు చిరంజీవి గారూ!: పీవీపీ జోక్ వైరల్

  • 'బీ ద రియ‌ల్ మేన్‌' కు టాలీవుడ్ నటుల స్పందన
  • ఇంటిపనులైతే ఓకేగానీ, మీలా మేము నలభీములం కాదు
  • మెగాస్టార్ చేయగాలేనిది మీకేమైందని అంటున్నారు
  • ట్విట్టర్ లో పీవీపీ ఆసక్తికర పోస్ట్
PVP Joke On Chiranjeevi Goes on Viral

'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ వంగా ప్రారంభించిన 'బీ ద రియ‌ల్ మేన్‌' చాలెంజ్ కి టాలీవుడ్ సెలబ్రిటీల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ఇంట్లోని మ‌హిళ‌ల‌తో ఇంటి ప‌నులు చేయించ‌కండి అంటూ మొదలైన ఈ ఆన్ లైన్ చాలెంజ్ లో రాజమౌళి, ఎన్టీఆర్, చిరంజీవి, వెంకటేశ్, కొరటాల శివ తదితరులు పాల్గొన్నారు. మరికొందరు సినీ స్టార్స్, రాజకీయ నాయకులకు దాన్ని పాస్ చేశారు.

ఇల్లును శుభ్రం చేసిన తరువాత, చిరంజీవి స్వయంగా ఓ దోశను బ్రహ్మాండంగా వేసి, తన తల్లికి తినిపిస్తూ, అందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేయడంపై నిర్మాత, వైసీపీ నేత పీవీపీ స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టగా అదిప్పుడు వైరల్ అవుతోంది.

"చిరంజీవి గారు, ఏదో ఇంట్లో అంట్లు తోమగలము, గచ్చు కడగగలము కానీ మీరిలా స్టార్ చెఫ్ లా నలభీమ పాకము వండుతుంటే, మా ఆవిడ మెగాస్టారే చేయగలేనిది, మీకేమిటి అంటున్నారు.. మా సంసారంలో నిప్పులు పోయొద్దు రియల్ లైఫ్ మెగాస్టార్‌గారు.. జోక్స్ పక్కన పెడితే.. మీ ప్రేరణ ప్రశంసనీయం సర్" అంటూ పీవీపీ ట్వీట్ చేశారు. 

More Telugu News