Vijayasai Reddy: సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోవడం అంటే ఇదే!: విజయసాయిరెడ్డి వ్యంగ్యం

  • హెరిటేజ్ పాలధర పెంచారంటూ ట్వీట్
  • గతంలో ఎలుకలు పట్టేందుకు రూ.15 కోట్లు దోచిపెట్టారని ఆరోపణ
  • విజనరీ ఫిలాసఫీ ఇలాగే ఉంటుందని వ్యాఖ్యలు
Vijaysai Reddy take a dig at political rival

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో మరోసారి తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కరోనా కష్టకాలంలో హెరిటేజ్ పాలధర రెండు రూపాయలు పెంచారని, సంక్షోభాల్లో అవకాశాలు వెతుక్కోవడం అంటే ఇదేనని వ్యాఖ్యానించారు. గుంటూరు ఆసుపత్రిలో ఎలుకలు కొరికి చిన్నారి చనిపోతే మూషికాలను పట్టేందుకు రూ.15 కోట్లు దోచిపెట్టడం, దోమలపై యుద్ధం పేరిట వందల కోట్లు నాకేయడం ఈ కోవలోకే వస్తాయని, విజనరీ ఫిలాసఫీ ఇలాగే ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు.

More Telugu News