Brahmanandam: బ్రహ్మానందంలోని చిత్రకారుడు మేల్కొన్న వేళ... పెన్సిల్ తో శ్రీశ్రీ చిత్రం!

  • లాక్ డౌన్ తో ఇంటికే పరిమితం
  • శ్రీశ్రీ చిత్రాన్ని గీస్తూ కాలక్షేపం
  • సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రాజా గౌతమ్
Brahmanandam Sketches Sri Sri Picture

లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమైన నవ్వుల రేడు బ్రహ్మానందం, తనలోని చిత్రకారుడిని నిద్రలేపారు. ప్రముఖ రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) చిత్రాన్ని ఆయన పెన్సిల్ తో గీశారు. ఆ చిత్రాన్ని బ్రహ్మానందం కుమారుడు రాజా గౌతమ్, తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం బ్రహ్మానందం  కృష్ణ‌వంశీ తెర‌కెక్కిస్తోన్న చిత్రం 'రంగ‌మార్తాండ‌'లో కీల‌క పాత్ర‌ పోషిస్తున్నారన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఆ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. దీంతో ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నారు బ్రహ్మానందం. బ్రహ్మానందం గీసిన శ్రీశ్రీ చిత్రమిదే.

More Telugu News