Sandeep Kishan: సందీప్ కిషన్ ని నాకు శర్వానంద్ పరిచయం చేశాడు: దేవ కట్టా

  • దేవ కట్టా దర్శకత్వంలో వచ్చిన 'ప్రస్థానం'
  • కథాకథనాల పరంగా మంచి మార్కులు
  • సందీప్ కిషన్ ను దర్శకుడికి పరిచయం చేసిన శర్వానంద్
Sandip Kishan about Prasthanam Movie

తెలుగులో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న యువ కథానాయకులలో సందీప్ కిషన్ ఒకరు. 'ప్రస్థానం' సినిమా ద్వారా ఆయన తెలుగు తెరకి పరిచయమయ్యాడు. కథాకథనాల పరంగా ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దేవ కట్టా దర్శకత్వం వహించిన ఈ సినిమా, నిన్నటితో 10 సంవత్సరాలను పూర్తి చేసుకుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి దేవ కట్టా మాట్లాడుతూ .. 'ప్రస్థానం' సినిమా కోసం ముందుగా సందీప్ కిషన్ ను అనుకోలేదు. సందీప్ కిషన్ పోషించిన పాత్రకిగాను ముందుగా అమెరికాకు చెందిన ఓ వ్యక్తిని తీసుకున్నాము. మరో రెండు వారాలలో షూటింగు మొదలవుతుందనగా, వ్యక్తిగత కారణాల వలన అతను ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో సందీప్ కిషన్ ను శర్వానంద్ పరిచయం చేశాడు. సందీప్ కిషన్ ఆడిషన్స్ లో తన నటనతో మెప్పించాడు. ఆ పాత్రను ఓన్ చేసుకుని ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేశాడు" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News