COVID-19: ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 525

  • ఈరోజు కొత్తగా నమోదైన 23 కేసులు
  • కర్నూలులో 13, గుంటూరు లో 4 కేసులు
  •  కడపలో 3, నెల్లూరులో 2 కేసులు
Covid 19 cases increases in Andhrapradesh

ఏపీలో నమోదైన మొత్తం ‘కరోనా’ పాజిటివ్ కేసుల సంఖ్య 525గా ప్రభుత్వం పేర్కొంది. ఇందులో 20 మంది డిశ్చార్జ్ కాగా, 14 మంది మృతి చెందారని తెలిపింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 491గా పేర్కొంది. ఏపీలో ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 వరకు కోవిడ్19 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొంది. ఈ పరీక్షల్లో కర్నూలులో 13, గుంటూరులో 4, కడపలో 3, నెల్లూరులో 2, అనంతపురంలో 1 కేసు నమోదైనట్టు తెలిపింది. కొత్తగా నమోదైన 23 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 525 కి పెరిగినట్టు ఓ ప్రకటనలో పేర్కొంది.

More Telugu News