'నిశ్శబ్దం' బ్లాస్ట్ అయ్యేలా క్లైమాక్స్
- అనుష్క తాజా చిత్రంగా 'నిశ్శబ్దం'
- సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ
- హైలైట్ గా నిలిచే క్లైమాక్స్
ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ మర్డర్ ఎవరు చేశారనేదే సస్పెన్స్. ఎవరు చేసి ఉంటారనేది చివరివరకూ ఆడియన్స్ గెస్ చేయడానికి లేకుండా కథనం సాగుతుందని చెబుతున్నారు. నిశ్శబ్దాన్ని బ్లాస్ట్ చేస్తూ క్లైమాక్స్ ఉంటుందని అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఈ తరహా క్లైమాక్స్ రాలేదని అంటున్నారు. అనుష్క కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల్లో ఈ సినిమాకి చోటు దొరకడం ఖాయమని చెబుతున్నారు. ఇందులో మాధవన్ .. అంజలి .. షాలినీ పాండే ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే.