Punjab Nationa Bank: రెండో అతి పెద్ద బ్యాంకుగా అవతరించిన పీఎన్బీ

  • పీఎన్బీలో విలీనమైన ఓరియంటల్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్
  • విలీనం తర్వాత పీఎన్బీకి 11 వేలకు పైగా బ్రాంచులు
  • రూ. 18 లక్షల కోట్లకు చేరుకున్న వ్యాపార లావాదేవీలు
PNB becomes second largest public sector bank after SBI

భారత్ లో మరోసారి నేడు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం జరిగింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)లోకి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీలీనం అయ్యాయి. ఈ క్రమంలో మన దేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా పీఎన్బీ అవతరించింది.

ఓరియంటల్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంకుల బ్రాంచులన్నీ నేటి నుంచి పీఎన్బీ బ్రాంచులుగా కార్యకలాపాలను నిర్వహించనున్నాయి. ఈ బ్యాంకుల వినియోగదారులందరూ ఇకపై పీఎన్బీ కస్టమర్లుగానే చలామణి కానున్నారు. ఈ విలీనం తర్వాత పీఎన్బీకి మొత్తం 11 వేలకు పైగా బ్రాంచులు, 13 వేలకు పైగా ఏటీఎంలు, దాదాపు లక్ష మంది ఉద్యోగులు ఉన్నారు. బ్యాంకు వ్యాపార కార్యకలాపాలు రూ. 18 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

More Telugu News