Prabhas: సీసీసీ ఫండ్ కు హీరో ప్రభాస్ రూ.50 లక్షల విరాళం

  • రోజు వారీ సినీ కార్మికుల కోసం సీసీసీ ఫండ్ ఏర్పాటు  
  • ఇప్పటికే పీఎం, సీఎంల రిలీఫ్ ఫండ్ కు రూ. 4 కోట్లు ప్రకటించిన ప్రభాస్    
  • రూ.75 వేలు విరాళంగా ఇస్తానన్న బ్రహ్మాజీ
 Hero Prabhas donation to CCC

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇది రోజు వారీ కూలీలపై, కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమలో పని చేసే రోజు వారీ కార్మికులకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో టాలీవుడ్ ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఫండ్ కు విరాళాలు వచ్చి చేరుతున్నాయి.

ప్రముఖ హీరో ప్రభాస్ తన విరాళంగా రూ.50 లక్షలు ప్రకటించాడు. ‘కరోనా’పై పోరాటానికి గాను పీఎం రిలీఫ్ ఫండ్ కు, రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి నాలుగు కోట్ల రూపాయల విరాళాన్ని ప్రభాస్ ఇప్పటికే ప్రకటించాడు. టాలీవుడ్ కు చెందిన మరో నటుడు బ్రహ్మాజీ కూడా సీసీసీకి రూ.75 వేలు విరాళంగా ప్రకటించాడు.

More Telugu News