KTR: ఓ శుభవార్త.. ఆ పదకొండు కేసులు నెగెటివ్ గా తేలాయి: మంత్రి కేటీఆర్

  • రాష్ట్రంలో ఇంతకుముందు ‘కరోనా’ పాజిటివ్’ కేసులు 11 నమోదయ్యాయి
  • ఆ కేసులకు సంబంధించిన తాజా పరీక్షల నివేదికలు వచ్చాయి
  • ఈ కేసులన్నీ నెగెటివ్ గా తేలాయి
  Minister Ktr happliy says eleven Positve cases turned out to be Negative

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి పోరాడుతుందనడానికి నిదర్శనంగా మంత్రి కేటీఆర్ ఓ శుభవార్త  చెప్పారు. రాష్ట్రంలో గతంలో నమోదైన పదకొండు పాజిటివ్ కేసులకు సంబంధించి తాజాగా టెస్టులు నిర్వహించారని తెలిపారు. ఆ టెస్టుల్లో అన్ని కేసులు ‘నెగెటివ్’గా తేలాయని, ఈ విషయాన్ని ప్రజలతో షేర్ చేసుకుంటానంటూ కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. కాగా, హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఆ పదకొండు మందికి చికిత్స అందించారు. ‘కరోనా’ బారి నుంచి బయటపడ్డ వీరిని ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జి చేయనున్నట్టు సమాచారం. 

More Telugu News