Andhra Pradesh: 'ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్' ఆర్డినెన్స్ కు ఏపీ గవర్నర్ ఆమోదం

  • కరోనా కారణంగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు రద్దు
  • బడ్జెట్ ఆమోదానికి ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం
  • 3 నెలలకు రూ.70 వేల కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్
AP Budget Ordinance

కరోనా కారణంగా ఏపీలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశాలు లేకపోవడంతో ఇటీవల బడ్జెట్ ఆమోదానికి ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. తాజాగా, ఈ ఆర్డినెన్స్ కు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. వచ్చే 3 నెలలకు రూ.70 వేల కోట్ల బడ్జెట్ కోసం ఆర్డినెన్స్ జారీ చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ కు ఏపీ క్యాబినెట్ ఇంతకుముందే ఆమోదం తెలిపింది.

More Telugu News