కోవిడ్ పై పోరులో మహీంద్రా గ్రూప్ ముందడుగు... అత్యంత చౌకగా వెంటిలేటర్ తయారీ!
- రూ.7,500కే వాల్వ్ మాస్క్ వెంటిలేటర్
- మార్కెట్లో అత్యాధునిక వెంటిలేటర్ ఖరీదు రూ.5 లక్షల నుంచి ప్రారంభం
- కేంద్రం అనుమతుల కోసం ఎదురుచూస్తున్నామన్న మహీంద్రా గ్రూపు
ఓ స్వదేశీ ఐసీయూ వెంటిలేటర్ల తయారీ సంస్థతో చేతులు కలిపిన మహీంద్రా సంస్థ చవకైన వెంటిలేటర్ల మోడళ్లను రూపొందించింది. మరో మూడు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ మోడళ్లకు ఆమోదం లభిస్తే పెద్ద ఎత్తున తయారుచేసేందుకు సన్నద్ధమైంది. కాగా, ఈ వెంటిలేటర్ కు అంబు బ్యాగ్ గా నామకరణం చేశారు. ఇది వాల్వ్ మాస్క్ ఆటోమేటెడ్ వెర్షన్ వెంటిలేటర్. తక్కువ ధరతో తాము రూపొందించే వెంటిలేటర్లు దేశంలో వెంటిలేటర్ల కొరతను గణనీయంగా తగ్గిస్తాయని మహీంద్రా వర్గాలు భావిస్తున్నాయి.