కరోనాతో ఉపాధి కోల్పోయిన వారి కోసం క్రౌడ్ ఫండింగ్
- ఇబ్బంది పడుతున్న దినసరి కూలీలు, చిరు వ్యాపారులు
- ఆదుకునేందుకు ముందుకొచ్చిన క్రౌడ్ ఫండింగ్ సంస్థ మిలాప్
- ఆన్లైన్ ద్వారా విరాళాల సేకరణ
క్రౌడ్ ఫండింగ్ ద్వారా విరాళాలు సేకరించి రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. ఇందుకు ప్రత్యేక ఆన్లైన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు సంస్థ హైదరాబాద్ ప్రతినిధులు తెలిపారు. సాయం చేయదలిచినవాళ్లు ఆన్లైన్లో milaap.org/covid19 పేజీని ఓపెన్ చేసి విరాళాలు ఇవ్వొచ్చని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన నిధులను అవసరార్థుల కోసం, చిన్న ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారికి కూడా ఉపయోగిస్తామని తెలిపారు.