హైదరాబాద్లో రోడ్లపైకి వచ్చిన కొందరు వాహనదారులు.. వెనక్కి పంపిన సీపీ సజ్జనార్
- హైదరాబాద్లోని సైబర్ టవర్స్ సిగ్నల్స్ వద్ద ఘటన
- వాహనదారులను ఆపిన సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్
- బయటకు ఎందుకు వచ్చారని ప్రశ్న
దేశంలో పాటిస్తున్నది కర్ఫ్యూ కాదని 'కేర్ ఫర్ యూ' అని సజ్జనార్ చెప్పారు. ప్రజలందరూ ఇందులో భాగస్వామ్యం కావాలని ఆయన చెప్పారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ఆయన సూచించారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో 6,000 మంది పోలీసులు పనిచేస్తున్నారు.
కాగా, జనతా కర్ఫ్యూలో ఎవరూ పాల్గొనకూడదంటూ సంగారెడ్డి 34వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ సమీ సోషల్ మీడియాలో పలు వ్యాఖ్యలు చేశారు. ప్రజలందరూ రోడ్లపైకి రావాలన్నారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు గృహ నిర్బంధం చేశారు.