Telangana: తెలంగాణ వ్యక్తికి కరోనా... రోగి నుంచి సోకిన మొదటి కేసు ఇదే!

  • ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి
  • కరోనా పాజిటివ్ గా వెల్లడి
  • అతడితో సన్నిహితంగా మెలిగిన మరో యువకుడు
  • ఇప్పుడు ఆ యువకుడికీ కరోనా
First corona contact case registered in Telangana

ఇప్పటివరకు తెలంగాణలో విదేశాల నుంచి వచ్చినవారికే కరోనా పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. తొలిసారిగా రాష్ట్రంలో ఓ వ్యక్తికి కరోనా సోకింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ యువకుడి ద్వారా సదరు వ్యక్తికి కరోనా వైరస్ సంక్రమించినట్టు గుర్తించారు. రాష్ట్రంలో ఈ తరహాలో ఇదే మొదటి కేసు. దుబాయ్ నుంచి ఓ వ్యక్తి ఈ నెల 14న నగరానికి రాగా కరోనా లక్షణాల కారణంగా అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అతడికి కరోనా సోకినట్టు ఈ నెల 19న ప్రభుత్వం ప్రకటించింది. ఆ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న మరో వ్యక్తికి తాజాగా కరోనా సోకినట్టు వైద్యపరీక్షల్లో వెల్లడైంది. దాంతో ఇప్పటివరకు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 21కి చేరినట్టయింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక బులెటిన్ విడుదల చేసింది.

More Telugu News