ఒంగోలులో పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు చేయించాం: ఆళ్ల నాని
- ఒంగోలులో కరోనాపై మంత్రి ఆళ్ల నాని సమీక్ష
- ఒంగోలు పాజిటివ్ వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉందన్న మంత్రి
- జిల్లాకు విదేశాల నుంచి వచ్చినవారిని గుర్తించామని వెల్లడి
ప్రకాశం జిల్లాలో నిర్వహించిన సర్వేలో ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని కూడా గుర్తించామని, వారి ఆరోగ్య పరిస్థితిని అనుసరించి ఐసోలేషన్ వార్డుల్లో, హోమ్ క్వారంటైన్ లో ఉంచామని వెల్లడించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు సామాజిక దూరం పాటించాలని, జనతా కర్ఫ్యూలో అందరూ భాగస్వామ్యం కావాలని ఆళ్ల నాని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఆందోళన చెందనవసరంలేదని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా, ఈ సమీక్ష సమావేశంలో ఆళ్ల నానితో పాటు జిల్లాకు చెందిన మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేశ్, అధికారులు పాల్గొన్నారు.