KTR: కరోనా వ్యాప్తి చెందకుండా హైదరాబాద్‌ అంతా శుభ్రం చేస్తున్న సిబ్బంది.. ఫొటోలు పోస్ట్ చేసిన కేటీఆర్

ktr share photos
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్‌లో కరోనా వ్యాప్తి చెందకుండా జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో డీఆర్ఎస్‌ సిబ్బంది క్రిమి సంహారక మందు స్ప్రే చేస్తున్నారు. ప్రజలు అధికంగా ఉండే బస్‌ స్టాండులు, మెట్రో స్టేషన్ల వద్ద, పార్కుల్లో ఈ పనులు కొనసాగుతున్నాయి.
                             ఇందుకు సంబంధించిన ఫొటోలను తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో క్రిమి సంహారక మందు స్ప్రే చేస్తున్నారు.
Go Back to Shorts
KTR
Corona Virus
Hyderabad

More Telugu News