KTR: కరోనా వ్యాప్తి చెందకుండా హైదరాబాద్‌ అంతా శుభ్రం చేస్తున్న సిబ్బంది.. ఫొటోలు పోస్ట్ చేసిన కేటీఆర్

  • జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో డీఆర్ఎస్‌ సిబ్బంది క్రిమి సంహారక మందు స్ప్రే
  • బస్‌ స్టాండులు, మెట్రో స్టేషన్ల వద్ద, పార్కుల్లో పనులు 
  • ప్రయాణికులకు కరోనా సోకకుండా చర్యలు
ktr share photos

హైదరాబాద్‌లో కరోనా వ్యాప్తి చెందకుండా జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో డీఆర్ఎస్‌ సిబ్బంది క్రిమి సంహారక మందు స్ప్రే చేస్తున్నారు. ప్రజలు అధికంగా ఉండే బస్‌ స్టాండులు, మెట్రో స్టేషన్ల వద్ద, పార్కుల్లో ఈ పనులు కొనసాగుతున్నాయి.
                             ఇందుకు సంబంధించిన ఫొటోలను తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో క్రిమి సంహారక మందు స్ప్రే చేస్తున్నారు.

More Telugu News