Jagga reddy: ఉత్తమ్ వ్యక్తిత్వం ఉన్న నేత ..కించపరిచేలా మాట్లాడొద్దు: రేవంత్​ కు జగ్గారెడ్డి హితవు

  • ఖైదీలు వ్యాఖ్యలు చేశారంటూ ఉత్తమ్ పై రేవంత్ విమర్శలా!
  • సిన్సియర్ గా పని చేస్తున్న ఉత్తమ్ ను చెడగొట్టద్దు
  • కోర్ కమిటీ లో అన్ని విషయాలు మాట్లాడుకుంటే బాగుంటుంది
Sangareddy MLA Jaggareddy comments on Revanthreddy

టీ–పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఖైదీలు వ్యాఖ్యలు చేశారంటూ ఆ పార్టీకే చెందిన రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఖండించారు. ఉత్తమ్ వ్యక్తిత్వం ఉన్న నేత అని, ఆయనను కించపరిచేలా మాట్లాడొద్దని రేవంత్ కు హితవు పలికారు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా సిన్సియర్ గా పని చేస్తున్న ఉత్తమ్ ను చెడగొట్టొద్దని సూచించారు. కోర్ కమిటీ ఏర్పాటు చేసుకుని అన్ని విషయాలు మాట్లాడుకుంటే బాగుంటుంది తప్ప, ఇలా బజారునపడి వ్యాఖ్యలు చేయొద్దని రేవంత్ కు సూచించారు.

టీ– పీసీసీ అధ్యక్షుడి మార్పు గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఈ విషయమై ఢిల్లీలో ఏం జరుగుతుందో తెలియదు గానీ, రాష్ట్రంలో మాత్రం ‘న్యూసెన్స్’ జరుగుతోందంటూ పరోక్షంగా రేవంత్ పై మండిపడ్డారు. పీసీసీ పదవిని ఉత్తమ్ కు హైకమాండ్ అప్పజెప్పింది తప్ప, ఆయనేమీ పైరవీ చేసి ఆ పదవి తెచ్చుకోలేదని అన్నారు. ఆ పదవి కోసం కొందరు పాకులాడుతున్నారంటూ రేవంత్ పై జగ్గారెడ్డి పరోక్షంగా దుమ్మెత్తి పోశారు.

More Telugu News