Corona Virus: ‘కరోనా’ జాగ్రత్తలపై అన్ని రాష్ట్రాల సీఎస్​ లకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖలు

  • ‘కరోనా’పై ప్రజలను చైతన్యపరిచే  కార్యక్రమాలు నిర్వహించాలి
  • ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా ఉంచాలి
  • ప్రజలు సామాజిక దూరం పాటించాలి

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖలు రాసింది. ఈ విపత్తును అధిగమించేందుకు ప్రజలు సహకరించాలని కోరుతూ పలు సూచనలు చేసింది.  

– ‘కరోనా’పై ప్రజలను చైతన్యపరిచే  కార్యక్రమాలు నిర్వహించాలి
– ప్రభుత్వ ఉద్యోగుల పనివేళలు రెగ్యులేట్ చేయాలి
– ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా ఉంచాలి
– జనసమ్మర్థం తగ్గించేందుకు చర్యలు చేపట్టాలి
– ప్రైవేట్  సంస్థలు తమ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ప్రాధాన్యత ఇవ్వాలి
– రైళ్లు, బస్సుల్లో ప్రయాణికులు దూరం దూరంగా కూర్చోవాలంటూ తదితర సూచనలు చేసింది.

More Telugu News