Andhra Pradesh: కరోనా ఎఫెక్ట్​.. రేపటి నుంచి ఏపీలో విద్యా సంస్థలు బంద్​

  • కరోనా వైరస్ నిరోధక చర్యల్లో భాగంగా చర్యలు
  • అన్ని విద్యా సంస్థల మూసివేతకు నిర్ణయం
  •  ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలు జారీ  

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ, వైద్య శాఖల ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. రేపటి నుంచి అన్ని విద్యా సంస్థలను మూసివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఆదేశాల మేరకు పాఠశాలలు, కళాశాలలు, యూనివర్శిటీలు, కోచింగ్ సంస్థలు మూసివేయనున్నారు.

More Telugu News