Atchannaidu: ప్రపంచమంతా కరోనా గురించి మాట్లాడుకుంటుంటే ఏపీలో పరిస్థితి మాత్రం విరుద్ధంగా ఉంది: అచ్చెన్నాయుడు
కరోనా ప్రభావంతో స్థానిక ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్ ను సీఎం సహా వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 'మీరు చెప్పిన విధంగా షెడ్యూల్ విడుదల చేసినప్పుడు అతను మంచి ఎన్నికల కమిషనర్... ఎన్నికలు వాయిదా వేయగానే అతని కులం పేరుతో మాట్లాడుతున్నారు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రపంచమంతా కరోనా గురించి చర్చించుకుంటుంటే ఏపీలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని విమర్శించారు. ఏపీ సీఎం కులాల ప్రస్తావన తెస్తూ, ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. దేశంలోని ప్రముఖ ఆలయాలు కూడా కరోనా కారణంగా వెలవెలబోతున్నాయని, ఏపీలోనూ తిరుమల, దుర్గమ్మ ఆలయాలు బోసిపోయాయని, దీనిపై మంత్రి వెల్లంపల్లి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.
ప్రపంచమంతా కరోనా గురించి చర్చించుకుంటుంటే ఏపీలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని విమర్శించారు. ఏపీ సీఎం కులాల ప్రస్తావన తెస్తూ, ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. దేశంలోని ప్రముఖ ఆలయాలు కూడా కరోనా కారణంగా వెలవెలబోతున్నాయని, ఏపీలోనూ తిరుమల, దుర్గమ్మ ఆలయాలు బోసిపోయాయని, దీనిపై మంత్రి వెల్లంపల్లి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.