Corona Virus: 'కరోనా'కు పారాసిటిమల్‌ వేసుకోవాలట.. జగన్‌ చెప్పారు!: బీజేపీ జాతీయ కార్యదర్శి ఎద్దేవా

  • బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్‌ధర్‌ విమర్శలు
  • ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌ సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తోంది
  • ఏపీ సీఎం జగన్‌ మాత్రం 'కరోనా వస్తుంది, పోతుంది' అంటున్నారు
  • హర్షవర్ధన్ జీ  ఏపీ ప్రజలను కాపాడండి 
paracetamol only medication for coronavirus

ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌ సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తోంటే ఏపీ సీఎం జగన్‌ మాత్రం మరోలా మాట్లాడుతున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్‌ధర్‌ విమర్శలు గుప్పించారు.

'కరోనా వస్తుంది, పోతుంది' అని జగన్‌ చెప్పారని, అంతేకాకుండా, ఇటువంటి వైరస్‌కు పారాసిటిమల్‌ను సిఫార్సు చేస్తూ ప్రకటన చేశారని ఎద్దేవా చేశారు. 'హర్షవర్ధన్ జీ, దయచేసి ఈ విషయాన్ని గుర్తించండి.. ఇటువంటి హాస్యాస్పద వ్యాఖ్యల సూచనల నుంచి ఏపీ ప్రజలను కాపాడండి' అని కేంద్ర మంత్రిని ఆయన కోరారు.

జగన్ చేసిన 'పారాసిటిమల్' వ్యాఖ్యలపై జాతీయ న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐలో వచ్చిన ఓ వార్తను ఆయన ఈ సందర్భంగా పోస్ట్ చేశారు. 'కరోనా' వైరస్‌కు పారాసిటిమల్‌ చక్కటి ఔషధం అని జగన్‌ అన్నట్లు అందులో ఉంది. కాగా, జగన్‌ చేసిన పారాసిటిమల్‌ వ్యాఖ్యలు పలు జాతీయ చానెళ్లలో మార్మోగిపోతున్నాయి.

More Telugu News